Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఊరట లభించింది. ఈ కేసులో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ బెయిల్ పొడిగించింది. తనపై దిగువ కోర్టు ఇచ్చన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కింది కోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్ చేసిన అభ్యర్ధనపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని కోర్టు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
2019 కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాందీ ప్రధాని మోడీ ఇంటి పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గానీ ఇటీవల ఆయనకు సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై ఇవేళ ఆయన గుజరాత్ లోని సూరత్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, సోదరి ప్రియాంకా గాంధీ వెంట రాగా, ఆయన సూరత్ సెషన్స్ కోర్టుకు హజరైయ్యారు. భారీ భద్రత నడుమ ఆక్కడకు చేరుకున్నారు. తన జైలు శిక్ష తీర్పును సవాల్ చేశారు. ఈ తీర్పుపై అప్పీల్ చేసిన ఆయన మరో రెండు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలు శిక్ష ను సస్పెండ్ చేయాలని అందులో కోరారు. అయితే అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు వెల్లడించింది. అలాగే పరువు నష్టం కేసులో ప్రతివాదులు ఏప్రిల్ 10లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏప్రిల్ 13న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే ఆ విచారణకు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం లేదని తెలిపింది.
రాహుల్ గాంధీకి ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆయన లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. కాగా.. కోర్టు అప్పీల్ చేసేందుకు వెళ్లిన రాహుల్ వెంట భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడాన్ని బీజేపీ తప్పుబట్టింది.
YSRCP: అంతా ఉత్తుత్తి ప్రచారమే .. తేల్చేసిన సీఎం వైఎస్ జగన్