MP Navneet Kaur: అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, సినీనటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. కోర్టు.. ఆమె కుల దృవీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ. 2లక్షల జరిమానా కూడా విధించింది. ఈ పరిమాణం ఆమె పార్లమెంట్ సభ్యత్వంపై పడే ప్రమాదం ఏర్పడింది. నవనీత్ కౌర్ నకిలీ కులదృవీకరణ పత్రంతో ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ స్థానం అయిన అమరావతి (మహారాష్ట్ర) నుండి పోటీ చేసి గెలిచారని శివసేన మాజీ ఎంపి ఆనందరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమె సమర్పించింది తప్పుడు కుల దృవీకరణ పత్రంగా గుర్తించింది. దీనిపై ఆ దృవీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆరు వారాల్లోగా అన్ని దృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. కాగా బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత్ కౌర్ సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read More: Etela Rajender: నియోజకవర్గంలో ఈటల బలప్రదర్శన ర్యాలీ..! కేసిఆర్ పై సీరియర్ కామెంట్స్.. !!
నవనీత్ కౌర్ సినీ రంగం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఎన్సీపీ నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. నవనీత్ కౌర్ అమరావతిలో బద్నేరాకు చెందిన ఎమ్మెల్యే రవి రాణా సతీమణి. కన్నడ చిత్ర దర్శన్ మువీతో సినీరంగంలోకి ప్రవేశించిన నవనీత్ కౌర్..తెలుగులో మహారధి, రణం, జగపతితో పాటు పలు సినిమాల్లోనూ నటించారు.