Chetan Sharma: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ తన పదవికి రాజీనామా చేశారు. చేతన్ శర్మ రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదించింది. ప్రముఖ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి చేతన్ శర్మ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కోహ్లీ – రోహిత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ, అయితే వారిలో ఈగో ఉందని పేర్కొన్నారు చేతన్ శర్మ, టీ 20 కెప్టెన్సీకి రాజీనామా చేసి బీసీసీఐ పై పై చేయి సాధించాలని కోహ్లీ భావిస్తున్నారనీ, దీని వల్లనే గంగూలీ, కోహ్లీ మధ్య గ్యాప్ పెరిగిందని అన్నారు చేతన్ శర్మ.
టీమిండియా ప్లేయర్స్ తమ ఫిట్ నెస్ ఫ్రూవ్ చేసుకునేందుకు ఇంజెక్షన్ లు వాడుతారని, డోపింగ్ టెస్ట్ లో అవి దొరకవని కూడా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇష్టానుసారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై చేతన్ శర్మ పై బీసీసీఐ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే చేతన్ శర్మ పై బీసీసీఐ వేటు వేసే అవకాశం ఉందని భావించారు. ఇలాంటి తరుణంలో చేతన్ శర్మనే స్వయంగా రాజీనామా చేయడం, ఆ వెంటనే బీసీసీఐ ఆయన రాజీనామాను ఆమోదించడం జరిగిపోవడం గమనార్హం.
Earthquake: జమ్ముకశ్మీరులో మరో సారి భూకంపం