కరోనా వైసర్ నివారణకు సంబంధించి నిన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్ర ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఒ) నిపుణులు కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. నేడు తాజాగా కోవాగ్జిన్ ను అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు భారత్ లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్ లకు సిడీఎస్ సీఒ సిఫార్సు చేసినట్లు అయ్యింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే…కోవాగ్జిన్ దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను అభివృద్ధి చేసింది. కోవిషీల్డ్ టీకాను అక్స్ ఫర్డ్ యూనివర్శీ, అస్ట్రాజెనెకా అభివృద్ధి చేయగా సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసిన నేపథ్యంలో నేడో రేపో టీకా పంపిణీకి డీసీజీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తామని నేటి ఉదయమే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ రాగానే సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు గానూ నేడు రిహాసల్స్ గా దేశ వ్యాప్తంగా డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?