Big Breaking : సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఏపికి చెందిన సీనియర్ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్ రమణ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఏ బొబ్డే కేంద్రానికి లేఖ రాశారు. జస్టిస్ బొబ్డే ఏప్రిల్ 23వ తేదీన రిటైర్ అవుతున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు.
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు నెలల క్రితం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకి జస్టిస్ ఎన్ వి రమణపైనా, ఏపి హైకోర్టులోని న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం తీవ్ర దుమారం రేపిన సంగతి సంగతి. ఈ నేపథ్యంలో జస్టిస్ రమణకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరిస్తుందా లేదా అన్న దానిపై గత కొంత కాలంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే తన తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎన్ వి రమణ పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాయడంతో చర్చలకు పురిస్టాప్ పడినట్లు అవుతోంది.