Big Breaking: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానంలో మంటలు చెలరేగాయి. ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని ప్రధాన రన్ వే వద్ద దిగిన తర్వాత మంటలు చెలరేగాయి. విమానం చక్రం వద్ద మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తం అయి సురక్షితంగా బయటపడ్డారు. ఎయిర్ పోర్టు రెస్క్యూ, ఫైర్ ఫైటింగ్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని టర్బోప్రాప్ విమానం చక్రం మీద ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేశారు.
అగ్నిప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురన డోర్నియర్ 228 ట్విన్ టర్నోప్రాప్ విమానాన్ని కాన్పూరులోని హెచ్ఏఎల్ తయారు చేసింది. విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఐఎఎఫ్ తెలిపింది.