Big Breaking : చత్తీస్గడ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపిన మావోయిస్టు పార్టీ తమ వద్ద బందీగా ఉన్న రాకేష్ సింగ్ ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. 2వేల మంది పోలీసులు తమపై దాడికి వచ్చారని ప్రకటనలో తెలిపింది. దాడిలో నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయారని చెప్పింది. ఎన్ కౌంటర్ లో 14 ఆయుధాలు, రెండు వేల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తమపై సమాధాన్ ప్రవార్ పేరుతో మోడీ, అమిత్ షా యుద్ధానికి దిగారని ఆరోపించింది. చత్తీస్గడ్ ప్రభుత్వం మధ్యవర్తులను ప్రకటిస్తే చర్చలకు సిద్ధమని పేర్కొంది.
రెండు రోజుల క్రితం చత్తీస్గడ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 22 మంది జవాన్ లు అమరులైన విషయం తెలిసిందే. 30మందికిపైగా జవాన్ లు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు ఏపికి చెందిన జవాన్ లు కూడా ఉన్నారు. చర్చలకు సిద్ధం అంటూ మవోయిస్టు కమిటీ చేసిన ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.