భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 11 మందితో కొత్త కమిటీని ప్రకటించింది. పాత వారిలో కొందరిని బోర్డు నుండి ఉద్వాసన పలికి మరి కొందరికి స్థానం కల్పించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, శివరాజ్ సింగ్ చౌహాన్, షాహన్ వాజ్ హుస్సేన్ లను తదితరులను పార్లమెంటరీ బోర్డు నుండి ఉధ్వాసన పలికింది. కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సత్యనారాయణ జతియాలను బోర్డులోకి తీసుకుంది. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్ సహా ఓం మాథూర్, సుధా యాదవ్ ను బోర్డులోకి చేర్చుకుంది.
కొత్తవారితో కలిపిన పార్లమెంటరీ బోర్డు జాబితాను బీజేపీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.
కమిటీ సభ్యులు
- ప్రధాని నరేంద్ర మోడీ
- అమిత్ షా
- రాజ్ నాథ్ సింగ్
- యడియూరప్ప
- కే లక్ష్మణ్
- శర్బానంద్ సోనోవాల్
- ఇక్బాల్ సింగ్
- సుధా యాదవ్
- సత్యనారాయణ జరియా
- భూపేంద్ర యాదవ్
- దేవేంద్ర ఫడ్నవీస్