గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తొంది. గుజరాత్ లో బీజేపీ ముందంజలో ఉండగా,, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ కొనసాగుతున్నాయి. గుజరాత్ లో అధికార బీజేపీ వరుసగా ఏడో సారి జయభేరి మోగించేందుకు సిద్ధం అయ్యింది. ఢిల్లీ, పంజాబ్ మార్క్ ను గుజరాత్ లోనూ చీపురుతో ఊడ్చేయాలని ఆప్ ఆశించింది కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీ విజయం ఖాయమని వెల్లడించాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్ 92 సీట్లు కాగా ఇప్పటి వరకు అందుతున్న సమచారం ప్రకారం బీజేపీ 143, కాంగ్రెస్ 26, అమ్ అద్మీ పార్టీ (ఆప్) 9, ఇతరులు నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి.
మరో పక్క హిమాచల్ ప్రదేశ్ లో గత సంప్రదాయాన్ని తిరగ రాసి కొత్త రికార్డులు నెలకొల్పాలని అధికార బీజేపీ తహతహలాడుతోంది. డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిష్మా తో చరిత్ర సృష్టించాలని బీజేపీ ఆశపడుతుండగా, అధికార వ్యతిరేకత, అయిదేళ్లకు ఒక సారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి, తొలి సారిగా బరిలోకి దిగిన అమ్ అద్మీ పార్టీ (ఆప్) ఎవరి ఓట్లు చీలుస్తుందొనన్న ఆందోళన ఒక పక్క ఉంది. మొత్తం 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్ 35 సీట్లు కాగా, బీజేపీ 33, కాంగ్రెస్ 32 ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ట్రెండ్ కనబడుతున్నాయని అంటున్నారు.