BJP: : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద ఒంటరి పోరాటం చేస్తూనే జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో హీట్ పుట్టించేందుకు పలువురు రాజకీయ పార్టీల నేతలు యాక్టీవ్ మోడ్ లోకి వస్తున్నారు. సీనియర్ పొలిటికల్ లీడర్లలో ఒకరు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ తెరమీదకు వచ్చారు. దీంతో దేశంలో రాజకీయాలు మెల్లమెల్లగా వేడెక్కుతున్నాయన్న విషయం స్పష్టమైంది.
Read More: Modi: మోడీ లాగే కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు!
లాలూ ఈజ్ బ్యాక్…
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ, సమాజ్వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోమని ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అఖిలేష్ యాదవ్ కూడా గతంలోనే ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఆప్ నేతలతో అఖిలేష్ చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చావు దెబ్బ తీసేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో సమాలోచనలు చేస్తున్నారు.
Read More: BJP: ఆ సీఎంను ఓ ఆట ఆడుకుంటున్న బీజేపీ
బీజేపీకి చుక్కలు ఖాయమా?
యూపీ ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టీ, ఆర్జేడీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే దిశగా పలు నిర్ణయాలు జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్యలపై పోరాటం ఉధృతం చేసే దిశగా పావులు కదిపేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసే దిశగా ములాయం, లాలూ ప్రణాళికలు రచించనున్నారట. అసమానత, నిర్లక్షరాస్యత, వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సమస్యలు, పేదరికం, నిరుద్యోగం తదితర అంశాలపై ములాయంతో చర్చించినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు ఇప్పుడు దేశానికి కావాల్సింది పాపులిజం, సోషలిజం తప్ప.. క్యాపిటలిజం, కమ్యూనలిజం కాదని ఆయన అన్నారు. రాజకీయ దిగ్గజాలు లాలూ, ములాయం చేతులు కలిపి యూపీ ఎన్నికల్లో పనిచేస్తే బీజేపీకి చుక్కలు కనిపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.