BJP : గోద్రా పేరు వింటేనే చాలామందికి ముఖ్యంగా హిందూ ముస్లిం వర్గాల్లో ఓ రకమైన భావన, భయం అలముకుంటుంది. 2002 ఫిబ్రవరిలో గోద్రాలో జరిగిన సబర్మతి రైలు దహనం, దానిలో సుమారు యాభై తొమ్మిది మంది హిందూ కరసేవకుల సజీవదహనం, దాని తర్వాత జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు మరోసారి గోద్రా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితం మరోసారి ఆసక్తి రేపింది.
గోద్రా మున్సిపాలిటీలో భాజపాను హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం పార్టీ నిలువరించింది. బీజేపీ ని అధికారానికి దూరం చేసింది. ఇక్కడ గెలుపొందిన ఏడుగురు మజ్లిస్ పార్టీ సభ్యులనూ స్వతంత్రులకు మద్దతిచ్చి, వారు అధికార పగ్గాలు చేపట్టేలా చేసింది. దీంతో.. 2002 తర్వాత తొలిసారి ఈ మున్సిపాలిటీని భాజపా కోల్పోయినట్లైంది.
గోద్రా మున్సిపాలిటీ ఎన్నికలు నువ్వానేనా అన్నట్లు సాగాయి. ఇటీవల గుజరాత్లో తన ప్రభావం చూపిస్తున్న మజ్లీస్ పార్టీ తాజాగా గోద్రా లోనూ కీలకమైన ప్రాంతాలు పూర్ణ చోట 7 సీట్లను గెలుచుకుంది. దీని ద్వారా భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుపడింది. మునిసిపాలిటీ లో భారీగా గెలిచిన స్వతంత్రులకు.. తమ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు సభ్యుల మద్దతు ఉంటుందని మజ్లిస్ ప్రకటించింది. దీంతో స్వతంత్రులు ఏకమై మున్సిపల్ చైర్మెన్ పీఠానికి దగ్గర అయినట్లు అయింది. ఎంఐఎం మద్దతుతో స్వతంత్రులకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లభ్యమైంది. దీంతో వారంతా సమావేశమై ఎవర్ని మున్సిపల్ చైర్మన్ గా నియమించాలి అన్న దాని మీద సమాలోచనలు జరుపుతున్నారు.
గోద్రా మున్సిపాలిటీలో 44 వార్డులు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 18 స్థానాలను భాజపా గెలుచుకుంది. తొలిసారి బరిలోకి దిగిన ఎంఐఎం ఏడు చోట్ల విజయం సాధించింది. ఏకంగా 17 మంది స్వతంత్రులు గెలుపొందారు. గతంలో గోద్రా మున్సిపాలిటీలో ఎన్నడూ లేనంతగా భారీగా ఇండిపెండెంట్లు గెలిచారు. విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ జాడ కనిపించలేదు. స్వతంత్రుల బృందానికి మజ్లిస్ మద్దతు ప్రకటించడం వల్ల పీఠం చేజిక్కించుకునేందుకు భాజపాకు దారులు మూసుకుపోయాయి.
మా రాజకీయ శత్రువు భాజపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం మే మా ప్రధాన ధ్యేయం అని, గోద్రాలో భాజపా అధికారానికి దూరం చేయడంలోనే విజయం సాధించామని ఎంఐఎం పార్టీ గుజరాత్ అధ్యక్షుడు సాబీర్ కాబ్లివలా చెప్పారు. ప్రజలు మాకు(మజ్లిస్ పార్టీకి) ఓటేశారని, మేం వారి కోసం పనిచేస్తామన్నారు. గోద్రా ప్రజలు భాజపా పాలన పట్ల విసుగుచెందారని, కొత్తగా రాజకీయాలు చేస్తూ గోద్రానూ అభివృద్ధి పథంలో నడిపిస్థామంటూ చెప్పుకొచ్చారు.
ఇటీవల గుజరాత్ లో జరిగిన అన్నీ స్థానిక సంస్థల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ మంచి సీట్లను సాధించింది. మొదటిసారి దేశమంతటా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంటున్న ఎంఐఎం పార్టీ కు వస్తున్న ఫలితాలు ఊపు ఇస్తున్నాయి. బీహార్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంఐఎం ప్రభావం చూపే స్థానాలు గెలుచుకుంది. ఇదే ఉత్సాహంతో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమవుతోంది. ఇప్పుడు గుజరాత్ లో వస్తున్న ఫలితాల ఆధారంగా 2022 లో గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సైతం కసరత్తు ప్రారంభించినట్లు సాబిర్ తెలిపారు. దీనికి తగిన ప్రణాళికలు ఎప్పటినుంచో రూపొందిస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?