BJP: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సీఎంను మార్చాలని గత కొన్నిరోజులుగా కర్ణాటక బీజేపీలోని యడ్యూరప్ప వ్యతిరేక వర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో పాటు ఆయన వయస్సు కూడా ఓ కారణమని చెబుతున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు యడ్యూరప్ప రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారన్న వార్తలపై సీఎం యడ్యూరప్ప స్పందించారు. ఆ వార్తలను ఖండిస్తూ.. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.
Read More: Modi: అటు గవర్నర్లు…ఇటు మంత్రులు. .మోడీ లెక్క ఏంటో తెలుసా?
ఢిల్లీలో హల్ చల్..
సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా అన్న వార్తల నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో పర్యటించిన ఆయన… పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకే తాను ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై చర్చించామన్నారు. తన పట్ల జేపీ నడ్డాకు మంచి అభిప్రాయం ఉందన్నారు. కర్ణాటకలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చానని, ఆగస్టులో మరోసారి ఢిల్లీకి వస్తానని ఆయన పేర్కొన్నారు.
Read More: BJP: బీజేపీ విషయంలో బండి సంజయ్ ఆశ్చర్యపోయే మాటలు
ఆ కేంద్ర మంత్రులతో చర్చ
రాష్ట్రంలోని ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చించానని యడ్యూరప్ప తెలిపారు. ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కూడా కలిసి చర్చించానని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టును సాధించి తీరుతామని యెడియూరప్ప స్పష్టం చేశారు. కాగా, యడ్యూరప్పపై జరుగుతున్న చర్చకు చెక్ పెట్టేసేలా బీజేపీ పెద్దలే ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని పలువురు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.