కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యనుర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఈ తెల్లవారుజాము బాంబు దాడి జరిగింది. ఈ తెల్లవారుజామున దుండగులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు విసిరారు. బాంబు దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారు. అయితే వారు ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ బాంబు దాడిలో కార్యాలయ కిటికీలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. బాంబు స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఈ దాడి వెనుక అధికార సీపీఎం హస్తం ఉందని ఆర్ ఎస్ ఎస్ ఆరోపిస్తొంది. పయ్యనుర్ సీపీఎం నేత ధన్ రాజ్ వర్థంతి నేపథ్యంలో ఈ దాడి జరిగింది. అతని మరణం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
కార్యాలయాలపై వరుస దాడులు
జూన్ 30న కేరళలోని తిరువనంతపురంలోని సీపీఎం ప్రధాన కార్యాలయంపై జూన్ 30న బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘటనతో కేరళలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఆ తరువాత వయనాడ్ లోని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఈ ఘటన జరగడం హాట్ టాపిక్ మారింది.
విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అగ్రవర్ణాలకు కూడా..అర్హతలు ఇవీ