Breaking: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలను భూ ప్రకంపనలు మరో సారి వణికించాయి. ఢిల్లీ భూకంపనలు చేసుకోవడం ఈ నెలలో ఇది మూడవ సారి. జనవరి 1వ తేదీ రాత్రి, ఆ తర్వాత జనవరి 5వ తేదీ రాత్రి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాజాగా మంగళవారం (24వ తేదీ) ఢిల్లీ లోని పలు ప్రదేశాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
భూ ప్రకంపనలతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు కంపించాయి. కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. రిక్కర్ స్కేల్ పై 5.8 తీవ్రతగా నమోదు అయ్యింది. భూకంప కేంద్రం నేపాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల లో నుండి బయటకు పరుగులు తీశారు.
Earthquake of Magnitude:5.8, Occurred on 24-01-2023, 14:28:31 IST, Lat: 29.41 & Long: 81.68, Depth: 10 Km ,Location: Nepal for more information Download the BhooKamp App https://t.co/gSZOFnURgY@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @Ravi_MoES @OfficeOfDrJS @PMOIndia pic.twitter.com/y1Ak7VbvFB
— National Center for Seismology (@NCS_Earthquake) January 24, 2023