Breaking: ఎన్సీపీ నేత శరద్ పవార్ అస్వస్థతకు గురైయ్యారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ముంబాయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్యం దెబ్బతినడంతో పవార్ ఆస్పత్రిలో చేరారని తెలిపింది. ఆసుపత్రి వెలుపల ఎన్సీపీకి చెందిన నేతలు గానీ, కార్యకర్తలు గానీ గుమికూడవద్దని సూచించింది.
శరద్ పవార్ ప్రస్తుతం కోలుకుంటున్నారనీ, రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్ేయ అవకాశాలు ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వచ్చే నెల 4,5 తేదీల్లో షిరిడీలో నిర్వహించే పార్టీ శిబిరాల్లోనూ శరద్ పవార్ పాల్గొంటారని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే ఈ మేరకు అధికారిక లేఖను ట్విట్టర్ లో పోస్టు చేశారు. మరో పక్క శరద్ పవార్ త్వరగా కోలుకోవాలంటూ ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు భగవంతుడిని కోరుకుంటున్నారు.