Breaking: భారత్ బయోటెక్ కు డీసీజీఐ గుడ్ న్యూస్ అందించింది. భారత్ బయోటెక్ రూపొందించిన పిల్లల కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషద నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారిక వర్గాలు సమాచారం అందించాయి. దీంతో భారతదేశంలో అతి త్వరలో పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. త్వరలో 12 నుండి 18 సంవత్సరాల లోపు వారికి భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అందుతోంది. డీసీజీఐ అనుమతి నేపథ్యంలో భారత్ లో పిల్లలకు అందించే మొట్టమొదటి వ్యాక్సిన్ కోవాగ్జిన్ కానున్నది.
Breaking: అక్టోబర్ నెలలోనే ట్రయిల్స్ ఫలితాలు
ఇప్పటి వరకూ దేశంలో 18 ఏళ్ల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించే కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశంలో కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు అందిస్తున్నారు. కాగా కోవ్యాక్సిన్ తయారు చేసే భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై చేసిన ట్రయిల్స్ ఫలితాలను కమిటీకి అక్టోబర్ నెలలోనే సమర్పించింది.