CBSE Exams: 10వ తరగతి, 12వ తరగతి ప్రైవేటు విద్యార్థుల పరీక్షల విషయంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఈ ఏడాది నిర్వహించాల్సిన పదవ తరగతి, 12వ తరగతి రెగ్యులర్ విద్యార్థుల పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
అయితే 10,12 తరగతులకు చెందిన ప్రైవేటు విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 15 మధ్య వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేనందు వలల్ వారికి ఫలితాలు ప్రకటించాలంటే పరీక్షల నిర్వహణ తప్ప మరో మార్గం లేదని సీబీఎస్ఈ తన ప్రకటనలో పేర్కొంది.