Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో నక్సలైట్లు ఘతకానికి పాల్పడ్డారు. మందుపాతరతో మావోయిస్టులు చేసిన దాడిలో 10 మంది పోలీసులు, ఒక డ్రైవర్ మరణించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు ప్రయాణిస్తున్న వాహనింపై ఐఇడీ దాడికి తెగబడ్డారు. దంతేవాడ జిల్లాలోని అరన్ పూర్ సమీపంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నుండి తిరిగి వస్తున్న వాహనంపై దాడికి పాల్పడ్డారు.
డీఆర్జీ సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనం లక్ష్యంగా చేసుకుని మందుపాతర ఏర్పాటు చేసి వాహనం ఆ మార్గంలో వెళుతుండగా పేల్చివేశారు. మృతులు రామ్ కుమార్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్) టికేశ్వర్ ధ్రువ్ (అసిస్టెంట్ కానిస్టేబుల్కేఫ్ , ధామ్తారి) సలిక్ రామ్ సిన్హా (కానిస్టేబుల్, కంకర్), విక్రమ్ యాదవ్ (హెడ్ కానిస్టేబుల్), రాజేష్ సింగ్ (కానిస్టేబుల్, ఘజిపూర్, అప్), రవి పటేల్ (కానిస్టేబుల్), జవన్ అర్జున్ రాజ్ భర్ (కానిస్టేబుల్)లుగా గుర్తించారు.
ఈ దారుణ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. డీఆర్జీ వాహనంపై మావోలు దాడి చేయడం బాధాకరమని అన్నారు. అమరుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నక్సల్స్ ఏరివేతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించి సీఎం భూపేష్ బఘేల్ తో ఫోన్ లో మాట్లాడారు. ఘటనపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?