చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. ముఖ్యమంత్రి ఏమిటి కొరడా దెబ్బలు తినడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది అక్షర సత్యమే. ఆ ముఖ్యమంత్రే కొరడా దెబ్బలు తింటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. విషయంలోకి వెళితే.. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లా జబల్ గిరి గ్రామంలో గల గౌరీదేవి ఆలయంలో దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. దీపావళి తర్వాతి రోజున ఆలయంలో గోవర్థన్ పూజను ఘనంగా నిర్వహిస్తారు.
ఈ పూజలో పాల్గొన్న భక్తులు కొరడా దెబ్బలు తినడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా కొరడా దెబ్బలు తింటే శుభం కలుగుతుందనేది భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి భుపేష్ బాఘెల్ జబన్ గిరి గ్రామంలోని ఆలయాన్ని సందర్శించి గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి సంప్రదాయం ప్రకారం కొరడా దెబ్బలు తిన్నారు ముఖ్యమంత్రి భుపేష్ బాఘెల్. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించారు. అనంతరం ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ప్రతి ఏటా దీపావళి తర్వాతి రోజు జరిగే గోవర్థన్ పూజలో ఆయన పాల్గొంటున్నారు.
Anand Mahindra: రిషి సునాక్ ఎన్నికపై సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022