China: కరోనా వైరస్ను ప్రపంచానికి అంటించిన చైనా ఇప్పుడు అడ్డంగా బుక్కవుతోందా? ఇన్నాళ్లు భారతదేశం వినిపించిన మాటలను ఇప్పుడు డ్రాగన్ కంట్రీ విషయంలో ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయా? ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చైనాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఇటు ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ అటు జీ7 సమావేశంలో జరుగుతున్న పరిణామాలు చైనాను అడ్డంగా బుక్ చేస్తున్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
Read More: China: చైనాలో ముస్లింలపై దారుణాలు… కమ్యూనిస్టులు ఏం చెప్తారో
జీ7 లో ఏం జరిగిందంటే…
చైనాలో ఉయిఘర్ ముస్లింలపై జరుగుతున్న అరాచకాల అంశాన్ని అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. జీ-7 శిఖరాగ్ర సమావేశం రెండో రోజున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, ఉయిఘర్, ఇతర మైనార్టీ జాతులకు చెందినవారితో వెట్టి చాకిరీ చేయిస్తోందని మరోసారి ఆరోపించారు. ఈ విషయంలో చైనాపై ఒత్తిడి పెంచాలని బైడెన్ తన మిత్ర దేశాలను కోరారు. సమావేశం చివరిలో విడుదలజేసే సంయుక్త ప్రకటనలో ఈ అంశాన్ని తప్పనిసరిగా ప్రస్తావించాలని బైడెన్ కోరినట్టు తెలిసింది. దీనికి అన్ని యూరోపియన్ ప్రభుత్వాల మద్దతును ఆయన కోరగా వారు సంఘీభావం తెలిపారు.
Read More: corona: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫర్లు వస్తాయో తెలుసా?
ఇప్పటికే చైనా ఘాటు చర్యలు…
ఇదిలాఉండగా, ఇప్పటికే చైనా కు చెందిన పలు యాప్స్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిషేధం విధించారు. తద్వారా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాట అనుసరించనున్నట్లు తెలిపారు. మరోవైపు చైనా విషయంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ సైతం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చైనాలో ఉన్న ముస్లింల విషయంలో జరుగుతున్న తీవ్ర అరాచకాలు సహించరానివని పేర్కొంది.