సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవీ చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. ప్రాంతీయ భాషాభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ఆయన. ఇకపై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుల కాపీలు ప్రాంతీయ భాషల్లోనూ లభ్యమవుతాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. హిందీ సహా అన్ని భాషల్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రతులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందు కోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వ్యవస్థను వినియోగించుకోనున్నట్టు తెలిపారు.
ప్రతి పౌరుడు తనకు అర్థమయ్యే భాషలో కోర్టు తీర్పుల సమాచారాన్ని పొందగలిగినప్పుడే న్యాయవ్యవస్థకు సార్థకత అని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వినియోగం ద్వారా కోర్టుల్లో భారీస్థాయిలో మార్పులు తీసుకురావొచ్చని పేర్కొన్నారు.దేశంలో చివరి వ్యక్తికి కూడా న్యాయపరమైన సేవలు త్వరితగతిన అందేలా చూస్తామని ఆయన అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా (బీసీఎంజీ) ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More: ఏపి పరిపాలనా రాజధాని మూహూర్తం ఫిక్స్ అయినట్లే(గా)..! ఎప్పుడంటే..?