CJI Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పలు కీలక అంశాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ఇటీవల అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో నిర్వహించిన రెండు రోజుల సదస్సు, నిర్ణయాలకు సంబంధించి వివరాలతో జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు.
Read More: Vijaya sai: అశోక్ గజపతిరాజుపై కొనసాగుతున్న విజయసాయి విసుర్లు..!తాజాగా ఇవీ..!!
దేశంలో న్యాయస్థానాల్లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. న్యాయవ్యవస్థలో పని చేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తించాలన్నారు. కోవిడ్ వల్ల నష్టపోయిన న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
కరోనా కారణంగా డిజిటల్ పద్ధతిలో కొనసాగుతున్న కోర్టుల పని తీరు మరింత మెరుగుపర్చేందుక గానూ నెట్ వర్క్ ను బలోపేతం చేయాలని కోరారు. హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు కొలీజియం సిఫార్సులపై త్వరగా నిర్ణయాలను తీసుకోవాలని జస్టిస్ ఎన్ వీ రమణ లేఖలో మంత్రి రవిశంకర్ కు విజ్ఞప్తి చేశారు.