Panjab Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర ప్రదేశ్ తో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యుల్ ప్రకటించింది. అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఏడు విడతల పోలింగ్ నిర్వహిస్తుండగా పంజాబ్ లో ఒకే విడత పోలింగ్ జరపాలని ఈసి నిర్ణయించింది. ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ ఈసీకి కీలక నూచన చేశారు. పోలింగ్ ను ఆరు రోజు పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ఈసీకి లేఖ ఆయన లేఖ రాశారు.
Panjab Elections: పోలింగ్ ఆరు రోజుల పాటు వాయిదా వేయాలి
ఫిబ్రవరి 16న శ్రీగురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దాదాపు 20 లక్షల మంది ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ మధ్య ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ ను సందర్శిస్తారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కావున వీరంతా ఓటు హక్కు వినియోగించుకులేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కాబట్టి పోలింగ్ ను ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ కోరారు. ఇప్పటికే వివిధ పార్టీల అభ్యర్ధుల ప్రకటన, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతుండగా సీఎం చన్నీ ఈ కీలక సూచన చేశారు. దీనిపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇప్పటికే పంజాబ్ లోని అధికార కాంగ్రెస్ పార్టీ 86 మందితో కూడిన అభ్యర్ధుల తొలి జాబితాను నిన్న విడుదల చేసింది. చామ్ కూర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ పోటీ చేస్తుండగా, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఈసీి షెడ్యుల్ ప్రకారం ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కించి ఫలితాల విడుదల వెల్లడి జరపనున్నారు.