CM: కర్ణాటక రాష్ట్ర కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఇదే ఒరవడిలో పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి తనయులు కూడా తండ్రి బాటలోనే సీఎం అయ్యారు. మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం వరకూ దేశవ్యాప్తంగా ఎందరో నేతలు ఇలా సీఎం పీఠం అధిరోహించారు. అలా ముఖ్యమంత్రి పీఠమెక్కిన నేతల వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్.
Read More : BJP: దూసుకువస్తున్న మాయావతి.. యూపీలో బీజేపీకి బీపీ?
వీళ్లే ఆ నేతలు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేసి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగా నవ్యాంధ్రప్రదేశ్లో యువ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పొరుగున ఉన్న కర్ణాటకలో సీఎం హెచ్.డీ దేవగౌడ తనయుడు కుమారస్వామీ 2018 కర్ణాటకా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోని జేడీస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమారస్వామి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. తాజాగా బసవరాజ్ బొమ్మై సైతం అక్కడ సీఎం అయ్యారు. తమిళనాడులో దివంగత మాజీ సీఎం కరుణానిధి తనయుడు స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఒకప్పుడు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజూ పట్నాయక్ తనయుడు నవీన్ పట్నాయక్ కూడా ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అరుణాచల్ ప్రదేశ్ లో తండ్రి డోర్టీ ఖండు రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్న తనయుడు ఫెమ ఖండు సీఎంగా ఎదిగి అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా సీఎం పీఠాన్ని అధిష్టించారు.
Read More : KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
కశ్మీర్లో కూడా…
ఝార్ఖండ్ రాష్ట్రంలో సైతం తండ్రి శిబు సోరెన్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయుడు.. హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. జమ్మూ కాశ్మీర్ లో శేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత తనయుడు ఫరుక్ అబ్ధుల్లా కూడా ముఖ్యమంత్రి అయ్యడు. ఫరుక్ అభ్ధుల్లా తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఓమర్ అభ్దుల్లా కూడా సీఎం పదవిని చేపట్టాడు. ఉత్తరఖండ్ రాష్ట్రంలో హెచ్. ఎన్ బహుగుణ తనయుడు విజయ్ బహుగుణ కూడా సీఎం పదవిని చేపట్టారు.