Congress: గత కొద్దికాలంగా దేశంలో కాంగ్రెస్ హవా ఓ రేంజ్లో తగ్గుతుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ నేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరుతున్న తరుణంలో ఈ టాక్ మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సంచలన విశ్లేషణ చేశారు. పార్టీ మొత్తాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించడం వల్ల అప్పుడు కొంచెం మెరుగైన ఫలితాలను సాధించవచ్చని జైరామ్ విశ్లేషించారు.
Read More: Revanth reddy : హమ్మయ్య రేవంత్ రెడ్డి కి కొంచెం టెన్షన్ తప్పింది..
జైరామ్ ఏమంటున్నారంటే…
ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జైరామ్ రమేశ్ పార్టీని వదిలి వెళ్లిపోయిన నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ వారందరికీ విశేష ప్రాచుర్యాన్ని, అవకాశాలను కల్పించిందని గుర్తుచేస్తూ అయినప్పటికీ పార్టీని సదరు నేతలు వీడారని మండిపడ్డారు. కొందరు వెళ్లిపోయినప్పటికీ, యువ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది పార్టీ కోసం కష్టపడి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారని జైరామ్ తెలిపారు. ఏ పార్టీ అయినా కొన్ని పద్ధతులు ఉంటాయని పేర్కొన్న జైరామ్ వాటిని ఉల్లంఘించి పార్టీని వదిల వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. వారందరూ బీజేపీని ఒకప్పుడు విమర్శించారని పేర్కొన్న కాంగ్రెస్ నేత అలాంటి వారిని కూడా బీజేపీ ఇప్పుడు తమ పార్టీలో చేర్చుకుందని అన్నారు.
Read More: Modi: మోడీ మంత్రి వర్గంలో మార్పులు… చాన్స్ కొట్టేసిన యువనేత ఎవరంటే..
ఇదే తక్షణం చేయాల్సిన పని…
పార్టీని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని జైరామ్ రమేశ్ అన్నారు. నాయకత్వాన్ని ఓ క్రమపద్ధతిలో క్రమబద్ధీకరించాలి. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏ నేత వద్దా లేదు అందరూ పార్టీ కోసం తప్పకుండా కష్టించాల్సిందే అని జైరాం రమేశ్ తెలిపారు. కొత్త మిత్రులను వచ్చే ఎన్నికల నాటికి పార్టీ గుర్తించి, అలాంటి వారితో కలిసి పయనించాలని జైరామ్ రమేశ్ సూచించారు. కాంగ్రెస్కు సచిన్ పైలట్ గొప్ప ఆస్తి అని పేర్కొన్న జైరామ్ రమేశ్ ఆయనకు బ్రహ్మాండమైన భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉందని జోస్యం చెప్పారు.