కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యుల్ కు ఆమోదం తెలిపేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలకు గానూ సోనియా గాంధీ విదేశాలకు వెళ్లడం, ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న షెడ్యుల్ ప్రకారం ఈ రోజు సీడబ్ల్యుసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంకలు వర్చువల్ గా హజరయ్యే అవకాశం ఉంది.
ఆ సెలబ్రిటీలతో బీజేపీ అగ్రనేత జేపి నడ్డా భేటీ ఎందుకంటే..?
గులామ్ నబీ అజాద్ లాంటి సీనియర్ నేతలు పలువురు కాంగ్రెస్ ను వీడిన తరుణంలో జరుగుతున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని వీడిన నేతలు రాహుల్ గాంధీ వ్యవహారాల శైలిపై, నాయకత్వంపై విమర్శలు చేసి వెళ్లడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సోనియా, రాహుల్ నాయకత్వంపై నేతలు విశ్వాసం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి రాహుల్ గాంధీ .. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ నిర్వహించనున్న జోడో యాత్రపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో పార్టీలో సీనియర్ నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి.
మరో పక్క రాహుల్ చేపట్టే జోడో యాత్రకు రాష్ట్రాల వారిగా సమన్వయకర్తలను పార్టీ నియమించింది. తెలంగాణకు ఎస్ వీ రమణి, ఆంధ్రప్రదేశ్ కు డాలీ శర్మ ఇన్ చార్జిలుగా నియమితులైయ్యారు. వీరు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను సమన్వయం చేస్తూ రాష్ట్రాల్లో నేతలతో పాదయాత్రలకు ప్లాన్ చేయనున్నారు.
బ్రేకింగ్ .. కాంగ్రెస్ పార్టీ సీనియర్ గులాం నబీ ఆజాద్ బిక్ షాక్.. అన్ని పదవులకు రాజీనామా
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?