Corona Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తొంది. కొద్ది రోజుల నుండి కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం వరకూ దేశ వ్యాప్తంగా 5,233 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్క రోజులోనే ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. రోజు వారి కేసులు అయిదు వేలకు పైగా నమోదు అవ్వడం మూడు నెలల తర్వాత ఇదే మొదటి సారి. కాగా కోలుకున్న వారి సంఖ్య కొంత ఆశాజనకంగా ఉంది. కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొంది పూర్తి గా కోలుకున్న 3,345 మంది నిన్న డిశ్చార్జ్ అయ్యారు. కోలుకునే వారి శాతం 98.72 శాతం గా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 1.57 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,857 గా ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరో పక్క దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం నాడు 14,94,086 మందికి వ్యాక్సిన్ అందించగా, ఇప్పటి వరకూ పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,43,26,416కి చేరింది.