Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రుల్లో అక్సిజన్, మందుల కొరత వేదిస్తున్నది. నాలుగైదు రాష్ట్రాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా మూడున్నర లక్షలకుపైగా నిత్యం కేసులు నమోదు అవుతున్నాయి. మెడికల్ ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వైద్య సామాగ్రి పై మూడు నెలల పాటు కస్టమ్స్ సుంకం ఎత్తివేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. అదే విధంగా ఆరోగ్య సెస్ నుండి మూడు నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 16 ఆరోగ్య పరికరాలకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఏక్సైజ్ సుంకం మినహాయింపు జాబితాలో మెడికల్ ఆక్సిజన్, రెగ్యులేటర్, కనెక్టర్ లు, ట్యూబులు, వ్యాక్యూమ్ పరికరాలు, ఏఎస్ యూలు, అక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్, ఆక్సిజన్ ట్యాంకులు, క్రయోజనిక్ సిలెండర్ లు, ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ, నిల్వ సామాగ్రి ఉన్నాయి. ఇంతకు ముందు కరోనా మందుల ఎగుమతులపై నిషేదించడం, రెమిడిసివిర్ ఇంజక్షన్ తదితర మందులపై దిగుమతి సుంకంరద్దు. దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ తదితర కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.