Corona Effect: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
కరోనా నేపథ్యంలో గత రెెండేళ్లుగా మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల పాటు మారిటోరియం సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు శక్తి కాంత దాస్ తెలిపారు. ఇది ఆ వర్గాలకు ఊరట నిస్తుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామని శక్తి కాంత్ దాస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకూ కోవిడ్ సంబంధిత మౌలిక వసతుల కోసం రూ.50వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రస్తుత రేపో రేటుకు రూ.10వేల కోట్లు, రుణ గ్రహీతలకు రూ.10 లక్షల వరకూ తాజాగా రుణాలు అందిస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకూ ఈ సదుపాయం అందిస్తామని తెలిపారు. మే 20న రెండవ సారి రూ.35 వేల కోట్ల ప్రభుత్వ సెక్యురిటీలను కొనుగోలు చేస్తామని శక్తికాంత దాస్ వెల్లడించారు.