Corona : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి కరోనా టైంలో ఇంటా బయట విమర్శల పర్వం ఎదురవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో పెరుగుతున్న కేసులు, అదే సమయంలో టీకాల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విదేశీ టీకాలను తెప్పించాలని నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఈ రెండు కంపెనీలపై మనదేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కేంద్రం ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
Read More : Lock down: తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు?
అప్పుడలా … ఇప్పుడిలా
గతంలోనే భారత ప్రభుత్వానికి ఫైజర్ సంస్థ తను ఉత్పత్తి చేసిన కరోనా టీకాకు అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అలాగే మోడెర్నా సైతం సంప్రదించింది. అయితే ఈ రెండు టీకాలు క్లినికల్ ట్రయల్స్ చేయలేదని నిపుణుల కమిటీ వాటిని తిరస్కరించాయి. అయితే, దేశంలో సెకండ్ వేవ్ ఇటీవలి కాలంలో తీవ్రతరం కావడంతో విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం నిర్ణయం మార్చుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన, ఇతర దేశాల్లో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు భారత్ లో 2,3వ దశ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని ప్రకటన చేసింది. కానీ, ఇక్కడే భారత్కు షాక్ తగిలింది.
Read More: Corona: కరోనా కలకలం.. కేసీఆర్ కు ఓ బ్యాడ్ న్యూస్
ఇప్పుడు ఆ సంస్థలు షాక్ ఇస్తున్నాయి
భారత్ తనకున్న అవసరం ప్రకారం ఇప్పుడు దరఖాస్తు చేసుకోగా…అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడడం, ఇప్పటివరకు బుక్ చేసుకున్న దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకే మరో రెండేళ్లు పట్టనుండంతో భారత్ కు వ్యాక్సిన్లు సరఫరా చేయడం సాధ్యం కాదని ఆ కంపెనీలు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫైజర్, మోడెర్నాలకు భారత్ లో 2023 వరకు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఒకరకంగా భారత్ మంచి అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పాలి. అదే సమయంలో విపక్షాలు ప్రధానిపై విరుచుకుపడేందుకు చాన్స్ దొరికిందని భావించవచ్చు.