Corona: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినప్పటికీ థర్డ్వేవ్ భయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ గుడ్ న్యూస్ ఇంకో బ్యాడ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. కరోనా తగ్గినోళ్లు..ఇక రాదనుకోవద్దు. వైరస్ మళ్లీ అటాక్ చేస్తోంది. కరోనా వచ్చి పోయిన వారు ఇక మళ్లీ రాదని అనుకుంటున్న సంగతి తెలిసిందే. శరీరంలో కావాల్సినన్నీ యాంటీ బాడీస్ ఫామ్ అయి ఉంటాయన్న ధీమాలో ఉంటున్నప్పటికీ సీన్ రివర్స్ గా ఉందని చెప్తున్నారు. ఇంకోవైపు కొత్త టీకా గుడ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
Read More: Corona: గుడ్ న్యూస్ఃమనకు కరోనా ముప్పు తక్కువే!
కరోనా వచ్చిపోయిందా…
కరోనా వచ్చి తగ్గిన కొంతమందికి రెండు నుంచి మూడు నెలల్లో మళ్లీ అటాక్ అవుతోంది. ఇటీవల కొంతమంది మూడు నెలల వ్యవధిలో రెండోసారి కరోనా బారిన పడుతున్నారు. కరోనా వచ్చిన వాళ్లకి మళ్లీ రాదని అనుకోవటానికి ప్రధాన కారణం ఒక్కటే. కోవిడ్ ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత యాంటీ బాడీస్ ప్రొడ్యుస్ అవుతాయి. దీంతో మళ్లీ కరోనా అటాక్ చేసిన యాంటీ బాడీస్ లు ఉన్న వారికి ఏమీ కాదు. కానీ ఇప్పుడు తెలుస్తుందేమంటే అందరికీ యాంటీ బాడీస్ ప్రొడ్యుస్ కావటం లేదు. దీంతో రెండోసారి కరోనా బారిన పడుతున్నారు. కొంతమందిలో యాంటీ బాడీస్ రెండు నెలల్లోనే తగ్గిపోతున్నాయి. ఐతే ఈ ప్రభావం కొంతమందిలోనే ఉంటోంది. అందుకే కరోనా వచ్చిన వారు రెండు నెలల తర్వాత ఐజీజీ (యాంటీ బాడీస్) టెస్ట్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Read More: Corona: చైనా సంచలన వార్నింగ్… కరోనాను ప్రపంచానికి అంటించిందే కాకుండా…
వ్యాక్సిన్ వచ్చేస్తోంది…
అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతికి సంబంధించి దేశీయ ఫార్మా కంపెనీ సిప్లాకు డీసీజీఐ గతవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సిప్లా దిగుమతి ప్రక్రియ ప్రారంభించింది. ఈ వారం చివరి వరకు తొలి విడత దిగుమతులు పూర్తి అవుతాయని కంపెనీ చెప్పింది. జులై 15 నుంచి దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోడెర్నా వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టనున్నట్టు సమాచారం.