Corona: కరోనా వ్యాక్సిన్… ఇప్పుడు అందరి చూపు మహమ్మారికి చెక్ పెట్టే టీకాపైనే ఉంది. ఈ సమయంలోనే ఓ రెండు గుడ్ న్యూస్లు తెరమీదకు వచ్చాయి. దేశంలో మరో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మసీ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. ప్రస్తుతం భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకాలను వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్నారు. మోడెర్నా టీకా దిగుమతి కోసం సైతం ఇటీవల డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం జైడస్ క్యాడిలా వ్యాక్సిన్కు అనుమతి లభిస్తే వస్తే ఐదో టీకాగా నిలువనుంది.
Read More: Corona: గుడ్ న్యూస్ఃమనకు కరోనా ముప్పు తక్కువే!
జైడస్ సంస్థ ఏమంటుందంటే..
ZyCoV-D పేరుతో రూపొందించిన ఈ వ్యాక్సిన్ మూడు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయింది. తమ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి సంస్థ దరఖాస్తు చేసింది. ఈ అనుమతి దక్కితే ఏడాదికి 12 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తికి సన్నాహాలు చేసేందుకు జైడస్ క్యాడిలా సంస్థ యోచిస్తోంది. జైడస్ సంస్థ 12-18 ఏళ్ల వయసు గల వారితో సహ దేశవ్యాప్తంగా 50కిపైగా కేంద్రాల్లో 28వేల మంది వలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించింది. చివరి దశ ట్రయల్స్లో జైకోవ్-డీ సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. తమ వ్యాక్సిన్ నూతన వేరియంట్లపైన సమర్థవంతంగా పనిచేసినట్లు అధ్యయనంలో వెల్లడైందని జైడస్ క్యాడిలా సంస్థ తెలిపింది.
Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్లలకు కరోనా ముప్పు తక్కువట
మూడో వేవ్…
కరోనా మూడో వేవ్ వస్తుందన్న వార్తలపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తీసుకొని, కోవిడ్ నిబంధనలు పాటిస్తే కరోనా మూడోవేవ్ ప్రభావం పెద్దగా కనిపించదని ఆయన తెలిపారు. ప్రజల చేతలను బట్టే మూడో వేవ్ ప్రభావం ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా ప్లస్ వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని పేర్కొన్న ఎయిమ్స్ డైరెక్టర్ అపోహలు పక్కనపెట్టి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.