Corona Vaccine: అస్టాజెనాకా, ఆక్స్ పర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను పూనెలోని సీరమ్ ఇన్సిట్యూట్ భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ లు పెద్ద ఎత్తున కావాలంటూ వివిధ రాష్ట్రాల నుండి ఆర్డర్ లు సంస్థకు వస్తున్నాయి. వ్యాక్సిన్ ల కోసం వివిధ రాష్ట్రాల నుండి తీవ్రమైన ఒత్తడి రావడంతో సీరం అధినేత అదర్ పూనావాలా ఎవరికీ సమాధానం చెప్పలేక కుటుంబంతో సహా లండన్ ట్రిప్ కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వ్యాక్సిన్ డిమాండ్, ఉత్పత్తి విషయాల గురించి వివరించారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వవద్దని సూచించారు. రాత్రికి రాత్రి వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ తయారీ ప్రత్యేకమైన ప్రత్యేకమైన ప్రక్రియ, ఇప్పటికిప్పుడు ఇబ్బండి ముబ్బడిగా ఉత్పత్తి చేయలేమని వివరించారు. భారత్ కు అవసరమైన డోసులు తయారు చేయడం మామూలు విషయం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కొద్ది నెలల్లో 11 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ప్రభుత్వం నుండి రూ.1,732.50 కోట్లు అడ్వాన్స్ గా అందిందని నిర్ధారించారు.
వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకూ తమకు 26 కోట్ల డోసులకు ఆర్డర్ లు వచ్చాయనీ, ఇప్పటి వరకూ 15కోట్ల డోసులను సరఫరా చేశామని పూనావాలా వివరించారు. మిగిలిన 11 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు, ప్రైవేటు హాస్పటల్స్ కు రాబోయే కొద్ది నెలల్లో సరఫరా చేస్తామని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచించారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన అందించేందుకు గానూ శక్తికి మించిన కృషి చేస్తున్నామని ఆదర్ పూనావాలా పేర్కొన్నారు.
Amongst multiple reports it is important that correct information be shared with the public. pic.twitter.com/nzyOZwVBxH
— Adar Poonawalla (@adarpoonawalla) May 3, 2021