Corona vaccine: కరోనాను అరికట్టడంలో భాగంగా అన్ని దేశాలు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.. అయితే వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు కొన్ని అపోహల కారణంగా వెనకడుగు వేస్తున్నారు.. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యాక్సిన్ వేయించుకుంటే బిర్యానీ ఫ్రీ.. వ్యాక్సిన్ వేయించుకుంటే బంగారపు ముక్కుపుడక ఫ్రీ.. వంటి ఆఫర్లను ఇప్పటికే మనం విన్నాం.. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 18 సంవత్సరాలు పైబడినవారు వ్యాక్సిన్ వైపు మళ్లించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు “వ్యాక్స్ ఏ మిలియన్” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..!!
“వ్యాక్స్ ఏ మిలియన్” ఇందులో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్న యువతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి విజేతలకు 1 మిలియన్ డాలర్లు బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లో అబ్బిగైల్ బుగెన్స్కే 22 సంవత్సరాల యువతి తన మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంది.. బుధవారం “వ్యాక్స్ ఏ మిలియన్” డ్రాలో అదృష్టం ఈమెను వరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ ఓహియే ఆమెకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు.. అబ్బిగైల్ బుగెన్స్కే మిలీనియర్ అవడంతో ఆనందంతో తబ్బిబ్బులయిపోతుంది. అయితే మరో నాలుగు వారాల పాటు ‘వ్యాక్స్ ఏ మిలియన్’ డ్రా జరుగుతుందని మరో నలుగురు విజేతలను ఎంపిక చేసి వారికి కూడా 1 మిలియన్ డాలర్లను బహుమతిగా అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.