Covid -19: దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నది. రోజురోజుకు నమోదు అవుతున్న కరోనా కేసులు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఒ పక్క కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతున్నా కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా ఒక్క రోజే ఏకంగా రెండు లక్షల మార్కు దాటింది. గత చిన 24 గంటల్లో దేశంలో 2,00,739 కొత్త కేసులు నమోదు కావడం దేశంలోనే సరికొత్త రికార్డు. ఈ మహమ్మారి కాటుకు 24 గంటల వ్యవధిలో 1,038 మంది మృతి చెందారు.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,40,74,564 మంది కరోనా బారిన పడగా 1,24,29,564 మంది చికిత్సల అనంతరం కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా బారిన పడి లక్షా 73,123 మంది మృతి చెందారు. ప్రస్తుతం 14,71,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అధిక శాతం కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలను అమలు చేస్తున్నాయి.
మహారాష్ట్రలో జనత కర్ప్యూ అమలు చేస్తున్నది. విపరీతంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మరో సారి లాక్ డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్నా కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది. గత ఏడాది విధించిన లాక్ డౌన్ వల్ల జరిగిన నష్టం, ఇబ్బందులను దృష్టి పెట్టుకుని మరో సారి లాక్ డౌన్ విధించకూడదన్న భావనలో కేంద్రం ఉంది. అయితే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలే కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు అదికం అవుతున్న ప్రాంతాల్లో నిషేదాజ్ఞతలను కఠినంగా అమలు చేస్తున్నాయి. మరో పక్క దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.