Covid Cases: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తొంది. థర్డ్ వేవ్ అనంతరం గణనీయంగా కేసులు తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడ్డారు. మూడు నెలల తరువాత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభావం అంతగా లేనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కాగా 24 గంటల వ్యవధిలో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గురువారం ఉదయం నుండి శుక్రవారం ఉదయం వరకూ 7,584 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 24 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 36,267కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Covid Cases: మహారాష్ట్రలో భారీగా..
గత 24 గంటల్లో 3,791 మంది కరోనా నుండి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం రికవరీ రేటు దాదాపు 98.70 శాతంగా ఉండటం కొంత ఉపశమనం కల్గిస్తొంది. మహారాష్ట్రలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 2813 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 622, తెలంగాణలో 122 మంది కరోనా బారిన పడ్డారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. టెస్ట్ ల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మరో పక్క దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 194,76 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 15,31,510 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.