Crime News: అనుమానమే పెనుభూతంగా మారి సహచరిపై హత్యాయత్నం చేసిన ఓ ప్రభుద్ధుడి ఉదంతమిది. కేరళలోని అంచల్ ప్రాంతంలో నివాసం ఉండే పాన్ వాస్ అనే వ్యక్తి అతిరా అనే మహిళతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి మూడు నెలల శిశువు ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అతిరా, పాన్ వాస్ లకు గతంలోనే పెళ్లిళ్లు అయ్యాయి. అతిరాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాన్ వాస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకులు తీసుకున్న తరువాత వీరు సహజీవనం సాగిస్తున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ వీరు అధికారికంగా వివాహం చేసుకోలేదు.
వీరి సహజీవనం రెండేళ్లు సాఫీగానే సాగింది. అయితే అతిరా గతంలో టిక్ టాక్ లో యాక్టివ్ గా యాక్టివ్ ఉండేది. ఆమె వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ క్రమంలోనే అతిరాపై పాన్ వాస్ అనుమానం పెంచుకున్నాడు. కొందరితో అఫైర్ ఉన్నట్లు అనుమానంతో వేధించేవాడని స్థానికులు తెలుపుతున్నారు. ఆ అనుమానం పెనుభూతంగా మారి ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు పాన్ వాస్. ఆమె వంటి పై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read More: Viral video: ఈ ముసలాయన మామూలోడు కాదు..! నవ మన్మధుడే..! ఆయన ట్రాక్ రికార్డు ఆదుర్స్..!!
పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చనిపోయే ముందు వైద్యులు, బంధువులకు అతీరా తనపై పాన్ వాస్ కిరోసన్ పోసి నిప్పు అంటించాడని తెలిపింది. పోలీసులకు ఇదే విషయాన్ని వాగ్మూలంగా ఇవ్వడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.