ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటి సీఎం తేజస్వి యాదవ్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగ్గా ఆయన కోర్టుకు హజరైయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి .. తేజస్వి యాదవ్ పబ్లిక్ లో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా తేజస్వి యాదవ్ తరపు న్యాయవాది . సీబీఐ ఆరోపణలను తిప్పికొట్టారు. తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో అనేక విషయాలను మాట్లాడారని దానికి ఐఆర్సిటీసీ కేసులో బెయిల్ రద్దు చేయమని సీబీఐ కోరడం ఏమిటని ప్రశ్నించారు. తమను బెదిరించారని సీబీఐ అధికారులు భావిస్తే ఐపీసీ లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చని అన్నారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013లో సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని న్యాయవాది గుర్తు చేశారు.
సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారి ఒకరు ఇటీవల ప్రమాదానికి గురయ్యారని చెబుతూ సాక్షం లేనందున దీనిని బెదిరింపుగా సీబీఐ భావించలేదని అన్నారు. అయితే ఇటీవల తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత తమ అధికారులకు తప్పనిసరిగా ముప్పు ఉందనే అభిప్రాయానికి సీబీఐ వచ్చిందన్నారు. ఈ దృష్ట్యా తేజస్వి కి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తేజస్వికి బాధ్యతా మాట్లాడాలని హెచ్చరిస్తూ సీబీఐ చేసిన బెయిల్ రద్దు విజ్ఢప్తిని తిరస్కరించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?