Delhi: ప్రస్తుత కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో డిల్లీ సర్కార్ మందు బాబులకు గుడ్ న్యూస్ అందించింది. ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయాలకు కేజ్రీవాల్ సర్కార్ అనుమతి ఇచ్చింది. వెబ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వడంతో మందు ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది.
Read More: BJP vs Mamatha: జగన్ బాటలోనే మమత.. కానీ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టే ఉంది..!!
ఇప్పటికే చత్తీస్ఘడ్ రాష్ట్రంలో మద్యం డోర్ డెలివరీ సౌకర్యాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలోనూ డోర్ డెలివరీ ద్వారా మద్యం విక్రయాలకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేస్తున్నది. తొలుత దేశంలో ఏపి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయగా దీన్ని డిల్లీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్నది. మద్యం అమ్మకాల విషయంలో చత్తీస్ఘడ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంది.
Delhi government permits home delivery of Indian liquor and foreign liquor by ordering through mobile app or online web portal pic.twitter.com/zBwhYqUClY
— ANI (@ANI) June 1, 2021