ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆప్, బీజేపీ కౌన్సిలర్ లు పోటాపోటీ నినాదాలు, తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అత్యధిక స్థానాలు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తో పాటు బీజేపీ కూడా తమ అభ్యర్ధిని బరిలోకి దించడంతో ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీకి 104, కాంగ్రెస్ కు 9 స్థానాలు వచ్చాయి.
ఆప్ తమ పార్టీ మేయర్ అభ్యర్ధిగా షెల్లీ ఒబెరాయ్ తో పాటు అశు ఠాకూర్ ను నిలబెట్టింది. బీజేపీ రేఖా గుప్తాను తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ప్రొటెం స్పీకర్ గా బీజేపీ కౌన్సిలర్ ను లెఫ్టెనెంట్ గవర్నర్ ఎంపిక చేయడంపై అమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీనియర్లు ఉన్నా ఆయనకు ఎలా ప్రకటిస్తారని ఆప్ ప్రశ్నించింది. బిజేపీ కుట్ర చేయాలనే భావిస్తొందని ఆప్ ఆరోపించింది. ఆప్ ఊహించినట్లుగానే హౌస్ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ప్రొటెం స్పీకర్ ముందుగా నామినేటెడ్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముందుగా ఎన్నికైన కౌన్సిలర్ లతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరడంతో బీజేపీ, ఆప్ కౌన్సిలర్ ల మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు పోటాపోటీ నినాదాలు, తోపులాటతో గందరగోళ పరిస్థితి నెలకొంది. హౌస్ లో బీజేపీ గుండాయిజం చేస్తొందని ఆప్ కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సభలో రచ్చకు ఆప్ యే కారణమని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మేనాక్షి లేఖి ఆరోపించారు. వారికి (ఆప్ కౌన్సిలర్ లకు) నిబంధనలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని ఆమె అన్నారు. వారు (ఆప్) మెజారిటీలో ఉన్నప్పుడు, ఎందుకు భయపడతారు అని మీనాక్షి లేఖి ప్రశ్నించారు.
#WATCH | Delhi: BJP and AAP councillors clash with each other and raise slogans against each other ahead of Delhi Mayor polls at Civic Centre. pic.twitter.com/ETtvXq1vwM
— ANI (@ANI) January 6, 2023