Vistara Air lines: ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం అడిన విస్తారా ఎయిర్ లైన్స్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. సరైన శిక్షణ లేకుండానే నేరుగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కు ఫస్ట్ ఆఫీసర్ల ను (సెకండ్ పైలెట్) అనుమతిస్తుందన్నకు రూ.10లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. సాధారణంగా ఫస్ట్ ఆఫీసర్ పైలట్ కు సహాయకుడుగా, సెకండ్ పైలెట్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. వారికి విమానాల ల్యాండింగ్, టేకాఫ్ పై సిమ్యులేటర్ ప్లయిట్లలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాణీకులతో కూడిన విమానాల్లో విధులను అప్పగించాల్సి ఉంటుంది. పైలట్లకు ఇదే తరహా శిక్ష ఉంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Vistara Air lines: పది లక్షల జరిమానా
అయితే పైలెట్ లేకుండానే ఒక విస్తారా విమానాన్ని ఫస్ట్ ఆఫీసర్ ఇండోర్ లో ల్యాండ్ చేయడం, అతనికి సిమ్యులేటర్ లో శిక్షణ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తించిన డీజీసీఏ..ఆ సంస్థకు పది లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్య విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలకు చెలగాటం అడటంగానే అని డీజీసీఏ భావించింది.
DGCA fines Vistara Rs 10 lakh over violation of takeoff and landing clearance
Read @ANI Story | https://t.co/nZXr2TfLYp#DGCA #Vistara pic.twitter.com/pt6w7ky5mc
— ANI Digital (@ani_digital) June 2, 2022