Drugs Smuggling: దేశంలోని వివిధ నగరాల్లో, పట్టణాల్లో హెరాయిన్ తదితర మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో వివిధ దేశాల నుండి అక్రమ మార్గాల్లో డ్రగ్స్ రవాణా కొనసాగుతోంది. అధికారులు తనిఖీలు కొనసాగుతున్నా గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
Read More: Telangana Govt: బ్యాంకు ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..! అది ఎమిటంటే..!!
దోహా నుండి శంషాబాద్ విమానాశ్రయంకు వస్తున్న ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో వస్తున్న ఓ మహిళ మాదక ద్రవ్యాలు తరలిస్తుందని ముందస్తు సమాచారం రావడంతో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు తనిఖీ చేయగా ఓ మహిళ సూట్ కేసులో 8 కేజీల హెరాయిన్ ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.53 కోట్లు ఉంటుందని అంచనా. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఆ మహిళను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితురాలు జాంబియాకు చెందిన మకుంబా కరోల్ గా గుర్తించారు.