Earthquake: జమ్ముకశ్మీర్ లో శుక్రవారం వేకువజామున భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్ లోని కట్రా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ స్కేల్ పై 3.6 తీవ్రతగా నమోదు అయ్యింది. ఈ భూకంపం 10 కిలో మీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది.
అయితే ఈ భూకంపం వల్ల జమ్ముకశ్మీర్ లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కట్రా పట్టణానికి తూర్పున 97 కిలో మీటర్ల దూరంలో భూకంభం సంభవించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. నాలుగు రోజుల క్రితం ఈ నెల 13వ తేదీ సిక్కింలో భూకంపం సంభవించింది. సిక్కింలోని యుక్ సంలో రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతగా భూకంపం నమోదైంది.
Earthquake of Magnitude:3.6, Occurred on 17-02-2023, 05:01:49 IST, Lat: 33.10 & Long: 75.97, Depth: 10 Km ,Location: 97km E of Katra, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/dNYT7T7sLG@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/s5TTbI8b9L
— National Center for Seismology (@NCS_Earthquake) February 16, 2023
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?