నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ అవకతవకల వ్యవహారంపై ఏడాది క్రితమే అమెపై సీబీఐ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఈ ఉద్యోగుల ఫోన్లను ట్యాప్ చేసి తనకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు లబ్ది చేకూర్చేలా వ్యవహరించారన్న అభియోగాలపై చిత్రాపై సీబీఐ కేసు నమోదు చేసింది.
సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా తాజాగా ఈడీ కూడా అమె పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆమెను గురువారం ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరు పర్చి వారం రోజుల కస్టడీయల్ విచారణకు అభ్యర్ధించారు. అయితే కోర్టు నాలుగు రోజుల కస్టడీ విచారణకు అనుమతి ఇచ్చింది.