Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. తెలంగాణకు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి తోపాటు బినయ్ బాబును ఈడీ అరెస్టు చేసింది. పెర్నాడ్ రికార్డు లిక్కర్ కంపెనీలో బినయ్ బాబు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబులను ఈడీ అధికారులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తొంది. ఈ రోజు ఉదయం వారిని అరెస్టు చేశారు.
ఇప్పటికే తెలంగాణకు చెందిన రాబిన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబాయికి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇడీ అధికారులు అరెస్టు చేసింది. ఓ పక్క ఈ లిక్కర్ స్కామ్ అమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తొంది. రీసెంట్ గా ఢిల్లీ ఢిప్యూటి సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన దినేశ్ అరోరా అప్రూవర్ గా మారడం తెలిసిందే.