ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సోదాలు చేయడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్ , ముంబాయి, బెంగళూరు నగరాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీ డ్రాఫ్ట్ లో పాలుపంచుకున్న తయారీదారులతో పాటు మద్యం వ్యాపారంలో నిమగ్నమైన వారి నివాస, కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేస్తొంది. ఢిల్లీ, జోర్ బాగ్ లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సమీర్ మహీంద్రుకు కు సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఆయన యూపీఓ బ్యాంకు నుండి కోటి రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారని ఈడీ ఆరోపిస్తొంది. అదే విధంగా గుర్ గ్రామ్ లోని బుడ్డీ రిటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరా ప్రాంతాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
ఈడీ సోదాలు చేయడంపై మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొదట సీబీఐ దాడులు నిర్వహించింది. కానీ, ఏమీ గుర్తించలేకపోయింది. ఇప్పుడు ఈడీ దాడులు చేస్తొంది. వారు కూడా ఏమీ కనుగొనలేరు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న మంచి పనులను ఆపడానికి ఈ ప్రయత్నాలన్నీ, వాళ్లు (కేంద్రం) సీబీఐ, ఈడీని వాడి మాపై ఉసిగొల్పినా మా పనిని ఆపలేరు. నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఈ సోదాల్లో వాళ్లు పాఠశాలల బ్లూప్రింట్ ను మాత్రమే కనుగొంటారు అని పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?