Byju’s: ఆన్ లైన్ విద్యా కోర్సులు అందిస్తున్న ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ పై ఈడీ సోదాలు నిర్వహిస్తొంది. బైజూస్ సీఈఓ రవీంద్రన్ కు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేస్తొంది. బెంగళూరులో ఉన్న కార్యాలయం, నివాస ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్యం ఉల్లంఘనలపై రవీంద్రన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఈ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ డేటాను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కంపెనీ 2011 నుండి 2023 మధ్య రూ.28 వేల కోట్ల విలువైన ఎఫ్డీఐ (విదేశీ పెట్టుబడులు) లు అందుకుందని ఈ తనిఖీల్లో తేలినట్లు ఈడీ తెలిపింది. ఇదే సమయంలో కంపెనీ కూడా రూ.9,754 కోట్లను ఓవర్సీస్ డైరక్ట్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో పలు విదేశీ సంస్థలకు బదిలీ చేసినట్లు పేర్కొంది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులకు కంటెంట్ ఉచితంగా ఇస్తామంటూ ఏపి ప్రభుత్వంతో బైజూస్ గత ఏడాది ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని కామెంట్స్ చేసిన మంత్రి ఆర్కే రోజా