చైనాకు చెందిన షివోమీ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన కోట్లాది రూపాయల నగదును జప్తు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై విచారణ జరిపిన ఈడీ అధికారులు షివోమీ సెల్ కంపెనీకి చెందిన రూ. 5551.27ల నగదును సీజ్ చేశారు. సెల్ ఫోన్ తయారీ కంపెనీగా షివోమీకి పేరుంది.
ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు నగదును మళ్లించిందన్న అభియోగాలపై ఈడీ ఇంతకు ముందే కేసు నమోదు చేసింది. సదరు సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి సంబంధించిన సొమ్మును ఈ కంపెనీ ఎగవేసిందని ఈడీ గుర్తించింది. ఈడీ కేసు దర్యాప్తులో భాగంగా సదరు కంపెనీకి సంబంధించి కోట్లాది రూపాయల నగదును సీజ్ చేసింది.