Edible Oil: గత కొద్దికాలంగా చుక్కలు చూపిస్తున్న వంట నూనెల ధరల విషయంలో ఓ గుడ్ న్యూస్. కరోనా దెబ్బకి ఓవైపు ఆదాయం తగ్గితే, మరోవైపు పెట్రోల్, డీజిల్ రేట్ల మోతతో ఇబ్బందులెదుర్కొంటున్న జనం, వంట నూనెల మంటతో మరింత చిక్కుల్లో పడ్డారు.ఇలాంటి సమయంలో నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది. వంట నూనెల రేట్లు కిందటి నెలలో రికార్డు స్థాయికి చేరడంతో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపు ఆలోచన చేస్తోంది.
Read More: Corona: డబ్బులు ప్రింట్ చేసుకుంటే సమస్యే ఉండదు… కరోనా సమయంలో భలే విశ్లేషణ
ఇది పరిస్థితి…
మనదేశ వంట నూనె ల అవసరాల కోసం మూడింట రెండొంతులు దిగుమతుల మీదే ఆధారపడుతోంది. పామాయిల్ దిగుమతులపై డ్యూటీ ప్రస్తుతం 32.5 శాతం ఉండగా, సోయాబీన్, సోయా ఆయిల్పై 35 శాతం విధిస్తున్నారు. పామాయిల్ ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తుండగా, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ నూనెలు ఆర్జంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వంట నూనెల ధర తగ్గించేందుకు ఇంపోర్ట్ డ్యూటీ టాక్స్ తగ్గింపు ఆలోచన కేంద్రం చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు సన్నద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Read More: Corona: కరోనా టైంలో ఒక్కొక్కరుగా మోడీని భలే బుక్ చేస్తున్నారుగా
ఇది లాభం
ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే లోకల్ రేట్లు దిగి రావడంతోపాటు, వాడకం పెరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మలేషియా పామాయిల్కు మేలు జరిగినట్లే. ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేది మలేషియా, ఇండోనేషియాల నుంచే. అంతేకాదు, డ్యూటీ తగ్గింపు వల్ల దేశీయంగా ఆవాలు, సోయాబీన్, వేరుశనగల రేట్లు కూడా కిందకి వస్తాయి. వంట నూనెల దిగుమతులపై డ్యూటీ తగ్గింపు ప్రపోజల్ రివ్యూ చేస్తున్నట్లు సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. ఫైనల్ డెసిషన్ను గవర్నమెంటు ఈ నెలలోనే తీసుకోనుందని కన్జూమర్ ఎఫెయిర్స్ మినిస్ట్రీ అధికారి పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?