Fact Check Vaccination: సామాజిక మాథ్యమాల్లో ఇటీవల ఫేక్ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. పలు ఫేక్ వెబ్ సైట్ లు వారికి తోచిన తప్పుడు సమాచారం రాసి దాన్ని ఎవరో చెప్పినట్లుగా ప్రజలు నమ్మే విధంగా సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ తప్పుడు వార్తలు సోషల్ మీడియాల్లో హాల్ చల్ చేస్తుండటం ఏ వార్త నమ్మాలో ఏ వార్త నమ్మకూడదో తెలియక ప్రజలు ఆయోమయానికి గురి అవుతున్నారు. అదే కోవలో ఇటీవల కరోనా టీకాలను వేసుకున్న వారంతా రెండేళ్లలో చనిపోతారని ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత లుక్ మాంటగ్నైర్ చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. సామూహికంగా టీకాలు వేయడం వల్ల వైరస్ తాలూకు కొత్త వేరియెంట్లు పుడతాయని, ఇది ప్రపంచంలో ఉన్న అంటు వ్యాధుల నిపుణులకూ తెలుసుననీ, సామూహిక వ్యాక్సినేషన్ అతి పెద్ద పొరబాటని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారని తప్పుడు కథకాన్ని ఆ వెబ్ సైట్ తప్పుడు కథనాన్ని వంటి వార్చింది.
Read more: Tarun Tejpal Case: ఆ కేసు విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్
దీనిపై కేంద్ర ప్రభుత్వ విభాగమైన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందిస్తూ లుక్ మాంటగ్నైర్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పోస్టు నకిలీదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని షేర్ చేయొద్దని ప్రజలకు సూచించింది. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే రెండేళ్లలో చనిపోతారనేది పూర్తిగా అవాస్తమని పీఐబీ స్పష్టం చేసింది.
కరోనాను కట్టడి చేయడంలో టీకా సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపింది. యాంటీ బాడీలు వృద్ధి చెంది అవి వైరస్ ల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాయని పేర్కొంది. ఇకపోతే కెనడాకు చెందిన లైఫ్ సైట్ న్యూస్ గతంలో ఎన్నో అసత్య వార్తలను ప్రచురించి అభాసుపాలైందని, ఆ సైట్ లో ప్రచురించే కోవిడ్ – 19 వార్తలు అన్నీ అవాస్తవాలేనని తెలిపింది.